ఎన్టీఆర్ భరోసా ఫించన్ల పంపిణీ

Jul 1,2024 15:25 #Tirupati district

ప్రజాశక్తి- నారాయణవనం : ఎన్డీయే కూటమి ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా రూ.3వేల నుండి రూ. 4వేలు పింఛన్లు పెంచి లబ్ధిదారులకు ఇవ్వడమే కాకుండా ఫించన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం సోమవారం సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూలం నారాయణ వనం మండలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఆయన చిత్రపటానికి పాలభిషేకం చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పించన్ రూ.4 వేలు మరియు గత మూడు నెలల బకాయిలు సైతం చెల్లించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి దక్కుతుందని సత్యవేడు శాసన సభ్యులు కోనేటి ఆదిమూలం అన్నారు.ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమని తెలిపారు. అనంతరం రూ.7వేలు పించన్ లబ్ధిదారులకు అందజేయడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణవనం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ భాస్కరన్. గోవిందస్వామి. కోనటి బాబు. ఆర్ డి. ఏకాంబరం. ఊరప్ప. పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️