ప్రజాసమస్యల పరిష్కార వేదిక, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు

ప్రజాసమస్యల పరిష్కార వేదిక, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు

ప్రజాసమస్యల పరిష్కార వేదిక, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత: జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ప్రజాశక్తి- తిరుపతి సిటీ: జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్‌ రాజు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుండి వచ్చిన బాధితుల నుంచి జిల్లా ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కార వేదిక ద్వారా వచ్చిన 55 ఫిర్యాదులపై, వాటిని సంబంధిత పోలీస్‌ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కార మార్గం చూపించాలన్న ఆదేశించారు. వికలాంగులు, వద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి, వారి సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీలు వెంకట్రావు, కులశేఖర్‌, విమలకుమారి, డీఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.

➡️