ఆక్రమణలు ఉపేక్షించం: కమిషనర్‌

ఆక్రమణలు ఉపేక్షించం: కమిషనర్‌

ఆక్రమణలు ఉపేక్షించం: కమిషనర్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: ప్రజలకి ఇబ్బంది కల్గిస్తున్న ఆక్రమణలు ఉపేక్షించమని, ప్రతిఒక్క ఆక్రమణను తొలగిస్తామని, అదేవిధంగా కాలువల్లో పూడిక తీయించే పనులు చేపడుతున్నామని మునిసిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ అదితిసింగ్‌ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం మీ కోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కమిషనర్‌ అదితి సింగ్‌ ప్రజల నుంచి పిర్యాధులను, వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి వచ్చిన పిర్యాధులను, వినతులను కమిషనర్‌ స్వీకరిస్తూ సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని, అధికారులతో చర్చించి, సమస్యలను పరిశీలించి త్వరగా ఆయా సమస్యల పరిష్కారానికి కషి చేస్తామని హామీ ఇచ్చారు. పిర్యాధులపై కమిషనర్‌ స్పందిస్తూ తగుచర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ చరణ్‌తేజ్‌ రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ అమరయ్య, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ యువ అన్వేష్‌రెడ్డి, మునిసిపల్‌ ఇంజనీర్లు చంద్రశేఖర్‌, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్‌, కె.ఎల్‌.వర్మ, డిప్యూటీ సిటీ ప్లానర్‌ శ్రీనివాసులు రెడ్డి, అడిషనల్‌ సిటీ ప్లానర్‌ బాలసుబ్రమణ్యం, మేనేజర్‌ చిట్టిబాబు పాల్గొన్నారు.

➡️