కక్ష సాధింపు వద్దు

Jul 1,2024 15:23 #Tirupati district

అర్హులందరికీ పింఛన్లు ఇవ్వండి: సుధారెడ్డి
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): గత ప్రభుత్వ హాయంలో కక్ష సాధింపుతో పింఛన్లు పంపిణీ జరిగిందని, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో అర్హులైన అందరికీ పింఛన్లు అంది ఇవ్వాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి సూచించారు. మంగళంలో పులివర్తి సుధారెడ్డి పింఛన్ల లబ్ధిదారులను శాలువాతో సన్మానించి పింఛన్లను అందించారు. సామాజిక పింఛన్ల పంపిణీని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇళ్లకు చేర్చాలని ఆదేశించిన నేపథ్యంలో సచివాలయ సిబ్బంది అర్హుల జాబితాతో ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల నగదును అందించారు. ఉదయం మంగళం పరిధిలోని గ్రామపంచాయతీలలో సచివాలయ భవనాల వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి టిడిపి క్యాడర్, పింఛన్ల లబ్ధిదారులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి శెట్టిపల్లి పంచాయతీ అధ్యక్షులు కొల్లూరి ఈశ్వరయ్య, టిడిపి తిరుపతి రూరల్ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్, రూరల్ మండల మహిళా అధ్యక్షురాలు రామంజేరి మహేశ్వరి, మంగళం పంచాయతీ అధ్యక్షులు సురేష్, కార్యదర్శి రవిచంద్ర, తిరుమల నగర్ పంచాయతి అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి చెన్నరాయప్ప, సప్తగిరి కాలనీ పంచాయతీ అధ్యక్షులు జడారెడ్డి భాస్కర్ రెడ్డి, కార్యదర్శి అల్లా బాషా, పెద్ద సంఖ్యలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️