శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ టీటీడీ విస్తృత ఏర్పాట్లు

శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ టీటీడీ విస్తృత ఏర్పాట్లు

శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ టీటీడీ విస్తృత ఏర్పాట్లు ప్రజాశక్తి- తిరుమల: తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. మూడో రోజూ ఆదివారం ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని అక్టోపస్‌ వద్ద నుండి క్యూలైన్లు కొనసాగుతున్నాయి. వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో తిరుమల పోటెత్తింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది. ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర, శని, ఆదివారాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది. టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్యశాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూలైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. మాతశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్నప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, తాగునీరు అందించేందుకు టీటీడీ విస్తతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్‌ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు 1500 మంది 24/7 సేవలందిస్తున్నారు. కృష్ణతేజ సర్కిల్‌ వరకు వివిధ ప్రాంతాలలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వైద్య బృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల నివేదికల ప్రకారం ఆక్టోపస్‌ సర్కిల్‌లో లైన్‌లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది.

➡️