ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : సంక్రాంతి పండగ నేపథ్యంలో ఆదివారం నగరంలో మార్కెట్ కళకళలాడింది. వస్త్ర మార్కెట్తోపాటు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసే గంటస్తంభం మార్కెట్, కిరాణాషాపులు, వంట నూనె షాపులు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో ఎటు చూసినా ఇసుక వేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. మార్కెట్లో అడుగుపెట్టాలంటే.. పెద్దచెరువు గట్టు, సత్యలాడ్జి, రాజీవ్ క్రీడా మైదానం వద్ద వాహనాలు విడిచిపెట్టి లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటు చూసినా కొనుగోలుదారులతో మార్కెట్ నిండిపోవడంతో గంటల కొద్ది ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దీంతో కొన్నిచోట్ల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/vzm-market.jpg)