- పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టిన సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
12 వ రోజుకి చేరిన సమ్మె
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జె ఏ సి రాష్ట్ర అధ్యక్షులు కాంతారావు
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సమ్మె సోమవారం నాటికి 12వ రోజుకి చేరుకుంది. సమ్మెలో భాగంగా పోస్ట్ కార్డులు ముఖ్యమంత్రికి రాసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎపి సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు జెఏసీ రాష్ట్ర అధ్యక్షులు బి.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి బొత్స చర్చలు జరిపి ఎటువంటి పరిష్కారం చూపకుండా సమ్మెను విరమించమని కోరడం సరికాదని అన్నారు. మేము ప్రభుత్వానికి కొత్త గా ఏమి అడగలేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ లు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. కేవలం మాటలు చెప్పి మా సమ్మెను విరమించాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మా వేతనాలు, రెగ్యులరైజేషన్ గురుంచి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప సమ్మె విరమించేది లేదన్నారు. అనంతరం పోస్టు కార్డులను తపాలా బాక్స్ లో వేసి సిఎం కి పంపించారు. కార్యక్రమంలో జె ఏ సి జిల్లా అధ్యక్షుడు గురువులు, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.