జనసేనకు ఓటేస్తే నిరుపయోగం

Apr 28,2024 21:58

ప్రజాశక్తి- భోగాపురం  : ఎక్కడో అమెరికాలో ఉండి వచ్చేవారికి ఓటు వేసి గెలిపించినా ఉపయోగం లేదని ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. చిన్నారులు కూలికి వెళ్లకుండా పాఠశాలకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అమ్మ ఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టారని, తాజా మేనిఫెస్టోలో ఆ మొత్తాన్ని రూ.17వేలకు పెంచారని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పల నాయుడు అన్నారు. మండలంలో ఆదివారం మండల వైసిపి అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. లింగాలవలస, మరడపాలెం ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో కొండపు కొత్తయ్యరెడ్డి, చెరుకుపల్లి పంచాయతీలో రిక్క అప్పల నరసయ్య, గుడివాడ పంచాయతీలో దాసరి చంద్రశేఖర్‌ రెడ్డి, రాజాపులోవ పంచాయతీలో కిలారి వెంకటరమణ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తను మరోసారి గెలిపించాలని ఆయన అన్నారు. ఇప్పటికే నియోజకవర్గ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టా మన్నారు. మరడపాలెం ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీకి ప్రత్యేక ప్యాకేజి వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడు బాబు మాట్లాడుతూ ఎమ్మెల్యేను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, కొండపు కొత్తయ్య రెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం నిర్వాసితులకు ప్రభుత్వం ఎంతో మేలు చేసి మంచి కాలనీ నిర్మించిందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కందుల రఘుబాబు, ఉప్పాడ శివారెడ్డి, పడాల శ్రీనివాసరావు, భాను, బైరెడ్డి ప్రభాకరరెడ్డి, యర్రప్పల నారాయణ, సుందర హరీష్‌, కర్రోతు వెంకటరమణ, పతివాడ రామకృష్ణ, కొల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొ న్నారు.

➡️