లిఖిత్ రాజ్ కు కొవ్వలి అభినందనలు

Mar 28,2024 12:00 #West Godavari District

ప్రజాశక్తి-నరసాపురం : ఇటీవల జరిగిన గెట్ 2024 ఫలితాల్లో 526వ ర్యాంకు సాధించిన పెదసింగు లిఖిత్ రాజ్ కు కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలియజేశారు. లిఖిత్ రాజు బాల్యం నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచడమే కాకుండా గెట్ 2024 ఫలితాల్లో జాతీయస్థాయి ర్యాంకు సాధించడం అభినందనీయం అన్నారు. అదే విధంగా లిఖిత్ రాజ్ మన నర్సాపురం వాసి కావడం మన ప్రాంతానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నతస్థాయికి లిఖిత్ రాజ్ చేరుకోవాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.

➡️