ప్రజాశక్తి-పాలకొల్లు : పాలకొల్లు వైసిపి కార్యాలయం, పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరగని కృషిచేసిన సంఘ సంస్కర్త స్వాతంత్ర సమరయోధులు భారత మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మహా నాయకుడికి ఘన నివాళులు అర్పించిన గుడాల గోపాలరావు. వారితో టీటీడీ పాలకమండలి సభ్యులు మేకా శేషు బాబు. మాజి ఎం.సి.ఎం చైర్మన్ సాలా నర్సయ్య, జిల్లా JCS కన్వీనర్ ఖండవల్లి వాసు, వైసీపీ సీనియర్ నాయకులు అడబాల వెంకటరమణ, యలమంచిలి మండలం యూత్ అధ్యక్షులు లంక చిరంజీవి, కొత్త పోడూరు మండలం యూత్ అధ్యక్షులు దిగుమర్తి నాగరాజు, రామాంజుల పెద్ద మధు మొదలగు నాయకుల పాల్గొన్నారు. ఇంకా ఈ సందర్భంగా పట్టణంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.