వైసిపి వస్తే మన భూములు గల్లంతే

టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి రాధాకృష్ణ

తణుకురూరల్‌:రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి వస్తే మన భూములన్నీ లాక్కుంటారని టిడిపి తణుకు ఎంఎల్‌ఎ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం సాయంత్రంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో తణుకులో టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున యువత సంఘీభావం తెలుపుతూ తణుకు ఎన్‌టిఆర్‌ పార్కు నుంచి పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ మన ఆస్తులు, భూములు లాక్కునే జగన్‌ కావాలా.. మన ఆస్తులు భూములు విలువ పెంచే చంద్రబాబు కావాలా తేల్చుకోవాలన్నారు. రైతు సోదరులకు పూర్తిగా అండగా నిలుస్తామని, ధాన్యం ఎక్కడ కావాలంటే అక్కడ అమ్ముకునే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. రాబోయే కాలంలో తణుకు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️