అభివృద్ధి,సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తా

May 9,2024 16:59 #kutami
  • ఉండి టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకఅష్ణంరాజు
    ప్రజాశక్తి -కాళ్ళ
    తనను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గం అభివృద్ధికి తన శక్తివంచన లేకుండా లేకుండా కృషిచేస్తాననీ, అభివృద్ధి, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని ఉండి టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ళ మండలంలోని కలవపూడి, మోడీ, మాలవాని తిప్ప, అనందపురం, ఎస్సిబోస్‌ కాలనీ, ఇసుక దిబ్బ, మేకల దిబ్బ,ఎల్‌ ఎన్‌ పురం తదితర గ్రామాల్లో గురువారం ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉండి నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానన్నారు. పలు గ్రామాల్లో ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. దీనికి రఘురామకృష్నంరాజు సమాధానం ఇస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటక్కటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను సైకిల్‌ గుర్తుపైనా, నరసాపురం ఎంపిగా బిజెపి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మను కమలం గుర్తుపై ఓటేసిగెలిపించాలని అభ్యర్థించారు. తనను గెలిపిస్తే ఎన్నికల తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఈ ప్రచారంలోఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు,జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్‌ జుత్తిగ నాగరాజు, సాగిరాజు సోమరాజు,మంతెన వేణుగోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.
➡️