ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థిని గెలిపించండి

Apr 24,2024 20:22

 ప్రజాశక్తి- మెంటాడ : ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అరకు ఎమ్‌పి అభ్యర్థి పి.అప్పలనర్సను గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ కోరారు. బుధవారం మండలంలో జయితి, కొండలింగాలవలస, ఇప్పలవలస గ్రామాల్లో సిపిఎం ఎమ్‌పి అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేశారు. ఉపాధి హామీ కూలీలను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం చొరవతో యుపిఎ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చిందని, దానివల్ల నేడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు పనులు దొరకుతున్నాయని చెప్పారు. అటువంటి ఉపాధి హామీ చట్టానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి మోసం చేసిందన్నారు. అటవీ హక్కుల చట్టాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. హక్కులను కాలరాస్తోందన్నారు. బిజెపి దోపిడీకి, వైసిపి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు బి.రాంబాబు, రాకోటి రాములు, తామరాపల్లి సములు, సువ్వాడ తిరుపతి, ఎం.అప్పలనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️