క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్లో భారత్ తరపున పాల్గోనేందుకు జపాన్లోని టోక్యోకు హీరోయిన్ రష్మిక మందన్నా వెళ్లారు. శనివారంనాడు ఈ అవార్డుల వేడుక జరగనుంది. గ్లోబల్ ఈవెంట్గా ఈ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మనదేశం నుంచి రష్మికకు మాత్రమే ప్రాతినిధ్యం లభించింది. టోక్యో ఎయిర్పోర్టులో అక్కడి జపాన్ ఫ్యాన్స్ ఆమెకు పూలబొకేలతో స్వాగతం పలికారు.