రాజమండ్రి పరిసరాల్లో ‘1920 భీమునిపట్నం’

కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘1920 భీమునిపట్నం’ చిత్రం నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌. క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం రాజమండ్రి పరిసరాల్లో జరుపుకుంటోంది. ఈ మధ్యనే రామోజీ ఫిలింసిటీలో షూటింగ్‌ను ప్రాంభించి, పది రోజులపాటు చిత్రీకరణ జరిపారు. ఈ సందర్భంగా నిర్మాత కంచర్ల అచ్యుతరావు మాట్లాడారు. ‘రాజమండ్రిలో పది రోజుల పాటు షూటింగ్‌ జరుపుతాం. హీరో, హీరోయిన్లపై గోదావరి నేపథ్యంలో సన్నివేశాలను తీస్తున్నాం. ఈ చిత్రంలోని సీతారాం, సుజాత పాత్రల మధ్య నడిచే ప్రేమకధను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. కథానుసారం సంగీతం, ఫోటోగ్రఫీ చిత్రానికి ప్రాణంగా నిలుస్తాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందిస్తుండటం మా చిత్రానికి హైలైట్‌. రాజమండ్రి తర్వాత విశాఖపట్నం, అరకు, ఊటీలలో కూడా చిత్రీకరణ జరుపుతాం’ అని చెప్పారు.

➡️