దక్షిణాది అగ్ర దర్శకుడు ఏఆర్ మురుగదాస్ చాలా రోజుల తర్వాత కొత్త సినిమాను ప్రకటించారు. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఒక చిత్రం నిర్మిస్తున్నట్లు ఆయన తాజాగా వెల్లడించారు. ఈ యాక్షన్ చిత్రం కోసం మురుగదాస్ చాలా కాలంగా స్క్రీన్ప్లేపై వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నిర్మాతగా సాజిద్ నడియాద్వాలా ఉన్నారు. 2025 రంజాన్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/murugadoss-salman-khan-small-1710230331.jpg)