హీరో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సెట్స్లోకి తాజాగా మరో హీరోయిన్ ఆషికా రంగనాథ్ చేరింది. ఈమేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఇంట్రవెల్ యాక్షన్ సీక్వెన్స్ని హైదరాబాద్లో చిత్రీకరించారు. ఈ భారీ షెడ్యూల్ తర్వాత చిరంజీవి ఈ సినిమా చిత్రీకరణ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. తాజాగా మళ్లీ షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆషికా రంగనాథ్ విశ్వంభరలో భాగం అవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఆషికా ఇప్పటికే అమిగోస్, నా సామిరంగ చిత్రాలతో మెప్పించింది. పదికి పైగా కన్నడ చిత్రాల్లో ఆమె నటించింది. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/05/viswambara.jpg)