రూ.5 లక్షలు పోగొట్టుకున్న నటుడి సతీమణి

May 6,2024 18:31 #New Movies Updates

బాలీవుడ్‌లో నటుడిగా తనకుంటూ గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌ బేడీ, ఆయన సతీమణి ఇద్దరూ మోసపోయారు. వీరిద్దని సైబర్‌ మోసగాళ్లు మోసం చేశారు. 1979 నుంచి సినిమాలు, 1984 నుంచి సీరియల్స్‌ చేస్తూ రాకేశ్‌బేడీ బిజీగా ఉన్నారు. ఓటీటీల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి పలు వెబ్‌ సిరీసుల్లోనూ నటించారు. గతేడాది డిసెంబరులో ఈ నటుడిని ఓ వ్యక్తి మోసం చేశాడు. ఆర్మీ ఉద్యోగి అని తనని తాను పరిచయం చేసుకున్నారు. రాకేశ్‌కి చెందిన ఫ్లాట్‌ కొంటానని నమ్మబలికాడు. మాటల్లో పెట్టి రూ.85 వేలు డబ్బు తన అకౌంట్‌లోకి వచ్చేలా చేసి మోసం చేశాడు. ఇప్పుడు నటుడు రాకేశ్‌ బేడీ భార్యకు అలాంటి అనుభవమే ఎదురైంది. పొరపాటున తన బ్యాంక్‌ ఖాతాలోని రూ.5 లక్షలు.. మీ ఖాతాలో జమ అయ్యాయని ఓ అజ్ఞాత వ్యక్తి ఆరాధనకు చెప్పాడు. మొబైల్‌కి వచ్చే ఓటీపీ నంబర్‌ చెప్తే ఆ డబ్బులు తిరిగి తన ఖాతాలో జమ అయిపోతాయని అన్నాడు. ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన ఈమె ఫోన్‌ కట్‌ చేసేసింది. కానీ ఈమె ఖాతాలో నుంచి డబ్బులు కట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఈమె సైబర్‌ క్రైమ్‌ పోలీసులని ఆశ్రయించింది. అయితే ఇలా నెలల వ్యవధిలో ప్రముఖ నటుడి దంపతులు సైబర్‌ మోసానికి గురవడం చర్చనీయాంశమైంది.

➡️