హైదరాబాద్ : ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవికి బిఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ను అభినందించిన కవిత, ఆయనకు బతుకమ్మ జ్ఞాపికను బహూకరించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కూడా కవిత మెగాస్టార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆబాలగోపాలన్నీ అలరించిన నటుడు మెగాస్టార్ అని కొనియాడారు. ఆయనను పద్మవిభూషణ్ వరించడం తెలుగువారందరికీ గర్వకారణమని అన్నారు. మెగాస్టార్ను చూసి గర్వపడుతున్నానంటూ కామెంట్ చేశారు.
ఆబాల గోపాలన్నీ అలరించిన విఖ్యత నటులు, మెగాస్టార్ చిరంజీవి గారిని పద్మవిభూషణ్ వరించడం తెలుగు వారందరికీ గర్వకారణం. ఈ సందర్బంగా వారిని అభినందించడంతో పాటు 'బతుకమ్మ' జ్ఞాపిక బహూకరించడం జరిగింది. PROUD OF U ANNA 🙂 pic.twitter.com/q5pJWXkV8N
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 4, 2024