కుమారుడికి తాతగా బ్రహ్మానందం

May 9,2024 19:25 #movie, #raja gowtham

నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్‌ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్‌వీఎస్‌ నిఖిల్‌ దర్శకత్వం వహించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్‌కల్‌ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. సావిత్రి, శ్రీ ఉమేష్‌ యాదవ్‌ సమర్పణలో రాహుల్‌ యాదవ్‌ నక్కా నిర్మించనున్న ఈ సినిమాని ప్రీ లుక్‌ పోస్టర్‌, వీడియోతో ప్రకటించారు. ‘బ్రహ్మా ఆనందం’ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం. ఈ ఏడాది డిసెంబర్‌ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నాం” అని యూనిట్‌ పేర్కొంది.

➡️