మార్చి 1న ‘చారి 111’ విడుదల

వెన్నెల కిశోర్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘చారి 111’. టీజీ కీర్తి కుమార్‌ దర్శకుడు. సుమంత్‌ హీరోగా ‘మళ్ళీ మొదలైంది’ వంటి ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ తీసిన తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. బర్కత్‌ స్టూడియోస్‌ పతాకంపై అదితి సోనీ నిర్మిస్తున్నారు. ఇందులో సంయుక్తా విశ్వనాథన్‌ కథానాయిక. మురళీ శర్మ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మార్చి 1న థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.

‘చారి 111’ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ ఇంట్రెస్టింగ్‌గా, ప్రేక్షకుల్లో క్యూసియాసిటీ కలిగించే విధంగా డిజైన్‌ చేశారు. థియేటర్లలోకి గూఢచారిగా ప్రేక్షకుల్ని నవ్వించడానికి ‘వెన్నెల’ కిశోర్‌ వస్తున్నట్లు ఉంది. ఈ జనరేషన్‌ కమెడియన్లలో తనకంటూ సపరేట్‌ కామెడీ స్టైల్‌ క్రియేట్‌ చేసుకున్న ఆయన… ఈ సినిమాలో ఏ విధంగా నవ్విస్తారో థియేటర్లలో చూడాలి.

చిత్ర దర్శకుడు టీజీ కీర్తి కుమార్‌ మాట్లాడుతూ ”ఇదొక స్పై యాక్షన్‌ కామెడీ సినిమా. సిల్లీ మిస్టేక్స్‌ చేసే ఒక స్పై పెద్ద కేసును ఎలా సాల్వ్‌ చేశాడనేది సినిమా. వెన్నెల కిశోర్‌, సంయుక్తా విశ్వనాథన్‌ స్పై రోల్స్‌ చేశారు. వాళ్లకు బాస్‌ రోల్‌ మురళీ శర్మ చేశారు. కథలో ఆయనది కీలక పాత్ర” అని చెప్పారు.

చిత్ర నిర్మాత అదితి సోనీ మాట్లాడుతూ ”స్పై జానర్‌ సినిమాల్లో ‘చారి 111’ కొత్తగా ఉంటుంది. ‘వెన్నెల’ కిశోర్‌ గారి నటన, టీజీ కీర్తి కుమార్‌ దర్శకత్వం సినిమాకు హైలైట్‌ అవుతాయి. మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అతి త్వరలో ట్రైలర్‌, పాటలు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా ‘చారి 111’ పాటలు విడుదల కానున్నాయి.

➡️