కిక్కిరిసిన “గుంటూరు కారం” థియేటర్లు

guntur karam movie release celebrations

ప్రజాశక్తి-గుంటూరు : “గుంటూరు కారం” రిలీజ్ సందర్భంగా తెనాలిలో పలు థియేటర్ల వద్ద ప్రేక్షకులు సందడి చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులుతో పాటు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులతో థియేటర్లు కిక్కిరిసిపోయాయి. తెనాలి లక్ష్మి థియేటర్ వద్ద అభిమానులు సినిమా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బాణసంచా కాల్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన, “గుంటూరు కారం” హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో ఎస్ రాధా కృష్ణ నిర్మించారు. యాక్షన్, డ్రామాతో తెరకెక్కనున్న. ఈ చిత్రంలో మహేష్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. శుక్రువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదలౌతుంది.

➡️