చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం ”షరతులు వర్తిస్తాయి”. కుమారస్వామి(అక్షర) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ”షరతులు వర్తిస్తాయి” సినిమా త్వరలో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ ఈ సినిమా నుంచి ‘పన్నెండు గుంజల పందిర్ల కిందా ..’లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – దర్శకుడు కుమారస్వామి నాకు చాలాకాలంగా తెలుసు. బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి. ఈ పాట చూస్తుంటే తెలంగాణ మట్టివాసన కనిపిస్తోంది. సురేష్ బొబ్బిలి మ్యూజిక్, పెద్దింటి అశోక్ కుమార్ సాహిత్యం ఆకట్టుకున్నాయి. ఇక ప్రతి పెళ్లిలో ఈ పాట వినిపిస్తుందని అనుకుంటున్నా. నేను ఫిదా సినిమాలో వచ్చిండే పాట రూపొందించినప్పుడు అదే ఆశించాను. తెలంగాణ యాసలో పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. చైతన్య రావ్ యాక్టింగ్ చాలా నేచురల్గా చేస్తున్నాడు. షరతులు వర్తిస్తాయి టీమ్ కు కంగ్రాట్స్ చెబుతున్నా. మీ పాటలతో పాటు సినిమా కూడా మంచి హిట్ కావాలని కోరుకుంటున్నా.” అన్నారు.