మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన అప్ కమింగ్ పాన్-ఇండియన్ మూవీ ”మట్కా”తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని వైరా ఎంటర్టైన్మెంట్స్ డా. విజయేందర్ రెడ్డి తీగల, SRT ఎంటర్టైన్మెంట్స్ రజనీ తాళ్లూరితో కలిసి నిర్మిస్తున్నారు.
ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గ్రాండ్ స్కేల్ లో రూపొందుతోంది. హ్యుజ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అద్భుతమైన నటీనటులు, టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ”మట్కా” తాజా షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. మ్యాసీవ్ సెట్లో శరవేగంగా షుటింగ్ జరుగుతోంది.
ఈ లెన్తీ 40-రోజుల ముఖ్యమైన షెడ్యూల్ కోసం RFCలో మ్యాసీవ్ సెట్ను నిర్మించారు, ఇందులో యూనిట్ చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి ఈ షెడ్యూల్లో పార్ట్ అయ్యారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/06/varun.jpg)