విశాల్ కెరీర్లో 32వ సినిమాగా ‘రత్నం’ తెరకెక్కుతోంది. విశాల్తో ‘మాస్ ఆంటోని’ చిత్రాన్ని తెరకెక్కించిన హరి, ఈ సినిమాకి కూడా దర్శకత్వం చేయనున్నారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా 2024 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా విశాల్ తెలిపారు.