ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు నారా రోహిత్ నటించిన ప్రతినిధిా2 సినిమా విడుదలను నిలిపేయాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఇఒ ఎంకె మీనాను గురువారం వైసిపి గ్రీవెన్స్సెల్ అధ్యక్షులు అంకంరెడ్డి నారాయణమూర్తి, లీగల్ సెల్ నాయకులు శ్రీనివాసులురెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. టిడిపికి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రతినిధిా2 ట్రైలర్ వుందని వివరించారు. ఈ సినిమా ప్రదర్శనను ఈ నెల 10 నుంచి థియేటర్లలో ప్రదర్శించే చర్యలను అడ్డుకోవాలని కోరారు. ఓటర్లకు ఆన్లైన్ ద్వారా డబ్బును పంపిణీ చేస్తున్నారని, వీటిపై నిఘా పెంచేందుకు వాణిజ్య పన్నులశాఖలో అదనపు సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.