న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. కవిత పిటిషన్లపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. లోక్సభ ఎన్నికల్లో భాగంగా స్టార్ క్యాంపెయినర్గా ప్రచారంలో పాల్గొనాల్సి వుందని పిటిషన్లో కోరారు. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవిత .. ఇడి, సిబిఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. మహిళగా పిఎంఎల్ఎ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హత ఉందని పిటిషన్లో పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను అరెస్ట్ చేశారని ఆమె తరఫు న్యాయవాది వాదించారు. ఇడి కస్టడీలో ఉన్న సమయంలోనే సిబిఐ అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. దర్యాప్తును కవిత ప్రభావితం చేయగలుగుతారని, ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని ఇడి, సిబిఐ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి నేడు కవితకు బెయిల్ నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.