అంగన్వాడీ అక్కచెల్లెమ్మలపై అర్ధరాత్రి సమయంలో ప్రారంభమైన దమనకాండ సోమవారం సాయంత్రం వరకూ కొనసాగింది. శిబిరంలో ఉన్నవారి పట్ల పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ చేరుకున్న వారిని ఎక్కడికక్కడ బలవంతంగా అరెస్టు చేశారు. అయినప్పటికీ అంగన్వాడీలు, వారికి మద్దతుగా వామపక్షాలు, పలువురు ప్రజాసంఘాల నేతలు ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించారు.