గుజరాత్‌ కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌కు జరిమానా

Mar 27,2024 22:42 #Sports

ముంబయి: గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు భారీగా జరిమానా విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపిఎల్‌ నిర్వాహకులు బుధవారం ప్రకటనలో వెల్లడించారు. మినిమమ్‌ ఓవర్‌ రేటుకు సంబంధించిన ఐపిఎల్‌ ప్రవర్తనా నియమావళి ప్రకారం గుజరాత్‌ టైటాన్స్‌ జట్టుకు నాయకత్వం వహిస్తున్న గిల్‌కు జరిమానా విధించినట్లు, అయితే, సీజన్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా గిల్‌ నిలిచాడు. ఇదిలా ఉండగా.. ఐపిఎల్‌ 2024లో శుభ్‌మన్‌ గిల్‌ సారథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టు మంగళవారం చైన్నైతో జరిగిన మ్యాచ్‌లో 63పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.

➡️