- టి20 ప్రపంచకప్కు పాకిస్తాన్ జట్టు ఇదే!
లాహోర్: టి20 ప్రపంచకప్లో ఆడే పాకిస్తాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం వెల్లడించింది. కెప్టెన్గా బాబర్ అజమ్ ఎంపికవ్వగా.. చాలాకాలం తర్వాత హసన్ అలీకి పాక్ జట్టులో చోటు దక్కింది. హరీస్ రవూఫ్ స్థానంలో హసన్ అలీ చోటు దక్కించుకున్నాడు. టి20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్లతో టి20 సిరీస్లను ఆడనుంది. వెస్టిండీస్ పిచ్లు పేసర్లకు అనుకూలిస్తాయన్న దృష్ట్యా హసన్ అలీకి చోటు కల్పించినట్లు తెలిసింది. ఇక 15మంది జట్టు సభ్యుల్లో ఎక్కువమంది సీనియర్ ఆటగాళ్లే కావడం విశేషం. ఇక మే 10-14న డబ్లిన్లో ఐర్లాండ్తో మూడు టి20ల సిరీస్, మే 22-30న ఇంగ్లండ్తో నాలుగు టి20ల సిరీస్లో పాకిస్తాన్ తలపడనుంది.
జట్టు: బాబర్(కెప్టెన్), అక్బర్ అహ్మద్, అజాం ఖాన్, ఫకర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, ఇప్తికార్ అహ్మద్, ఇమాద్ వాసిం, అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, రిజ్వాన్, ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సయిమ్ ఆయూబ్, అఘా సల్మాన్, షాదాబ్, షాహిన్ షా, ఉస్మాన్ ఖాన్.