అండర్-19 వరల్డ్ కప్ లో నేడు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 10 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. ఓపెనర్ హ్యారీ డిక్సన్ 22, కెప్టెన్ హ్యూ వీబ్జెన్ 17 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో రాజ్ లింబానీ ఒక వికెట్ తీశాడు. లింబానీ ఆసీస్ ఓపెనర్ శామ్ కోన్ స్టాస్ ను డకౌట్ చేశాడు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/ind-19.jpg)