ఉబెర్‌ కప్‌ చివరి లీగ్‌లో భారత మహిళల ఓటమి

Apr 30,2024 20:40 #Badminton, #Sports

ఛెంగ్డు(చైనా): ఉబెర్‌ కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఆతిథ్య చైనా చేతిలో ఓటమిపాలైంది. ఇప్పటికే రెండు వరుస విజయాలతో క్వార్టర్స్‌కు చేరిన మహిళల జట్టు మంగళవారం జరిగిన గ్రూప్‌-ఎ చివరి లీగ్‌ మ్యాచ్‌లో చైనా చేతిలో 5-0తో చిత్తుగా ఓడింది. తొలి సింగిల్స్‌లో ఈషారాణి 12-21, 10-21తో టాప్‌సీడ్‌ చెన్‌ యుఫీ చేతిలో కేవలం 33 నిమిషాల్లోనే పరాజయాన్ని చవిచూసింది. మహిళల డబుల్స్‌లో ప్రియా-స్మృతి 13-21, 12-21తో, మూడో సింగిల్స్‌లో అన్మోల్‌ 9-21, 1-4తో వెనుకబడి ఉన్న దశలో గాయంతో మ్యాచ్‌ను వైదొలిగింది. రెండో డబుల్స్‌లో మ్యాచ్‌లో సిమ్రన్‌-రితిక 9-21, 10-21తో లీ-షెంగ్‌-టాన్‌ నింగ్‌ చేతిలో ఓటమిపాలవ్వగా.. చివరి సింగిల్స్‌ మ్యాచ్‌లో తాన్వీ శర్మ 7-21, 16-21తో వాంగ్‌ ఝి చేతిలో ఓడింది. దీంతో భారత్‌ గ్రూప్‌-ఎ నుంచి 2వ స్థానంలో నిలిచి క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక థామస్‌కప్‌లో పురుషుల జట్టు గ్రూప్‌-సిలో మూడో, చివరి లీగ్‌లో పటిష్ట ఇండోనేషియాతో బుధవారం(మే 1న) తలపడనుంది.

➡️