నేటి నుంచి ఐపిఎల్‌ టికెట్ల విక్రయం

Mar 18,2024 00:16 #2024 ipl, #Tickets

చెన్నై : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌) పోటీలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి మ్యాచ్‌ ఎంఎ చిదంబరం స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ – రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌ టిక్కెట్ల విక్రయం సోమవారం ఉదయం 9:30 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రారంభం కానుంది. స్టేడియంలోని సి, డి, ఇ లోయర్‌ టికెట్టు ధర రూ.1,700, ఐ, జె, కె అప్పర్‌ రూ.4,000, ఐ, జె, కె లోయర్‌ రూ.4,500, సి, డి, ఇ అప్పర్‌ రూ.4,000, కెఎంకె టెర్రస్‌ టికెట్టు ధర రూ.7.500గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో ఒకరు రెండు టిక్కెట్లు మాత్రమే కొనుగోలు చేయవచ్చని, పెటిఎం, చెన్నై సూపర్‌ కింగ్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చని సిఎస్‌కె చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కెఎస్‌ విశ్వనాథన్‌ తెలిపారు. 22న మ్యాచ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి.

➡️