సౌదీ స్మాష్ టిటి ఛాంపియన్షిప్
జెడ్డా: సౌదీ స్మాష్ టేబుల్ టెన్నిస్(టిటి) ఛాంపియన్షిప్లో మనిక బత్రా పోరాటం ముగిసింది. తొలిరౌండ్లో ప్రపంచ 2వ ర్యాంకర్పై సంచలన విజయంతో పాటు ప్రి క్వార్టర్స్లో జర్మనీ క్రీడాకారిణి 14వ ర్యాంకర్ మిటెల్ హామ్పై సంచలన విజయాలతో మెరిసన మనిక క్వార్టర్స్లో ఓటమిపాలైంది. గురువారం జరిగిన క్వార్టర్ఫైనల్లో మనిక బత్రా 1-4(11-7, 6-11, 4-11, 11-13, 2-11)తో 5వ ర్యాంక్ క్రీడాకారిణి జపాన్కు చెందిన హయాటా చేతిలో పోరాడి ఓడింది. ప్రపంచ 39వ ర్యాంకర్ అయిన 28ఏళ్ల మనిక.. ఈ టోర్నీ చరిత్రలో భారత్నుంచి క్వార్టర్స్కు చేరిన ఏకైక టిటి ప్లేయర్గా నిలిచింది.