న్యూఢిల్లీ : ఐపిఎల్లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సిబి) జట్టు తన పేరులో చిన్న మార్పు చేసింది. ప్రస్తుతం ఈ జట్టు పేరు ఆంగ్లంలో Challengers Bangalore అని రాస్తున్నారు. దీనిని స్వల్ప మార్పులు చేసి Royal Challengers Bengaluruగా మార్చింది. ఈ విషయాన్ని ట్వీట్ చేసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సిబి అన్బాక్స్ ఈవెంట్ నిర్వహిస్తోన్న వేళ ఈ ప్రకటన వచ్చింది.
అలాగే, కొత్త జెర్సీ ధరించిన జట్టు సభ్యులతో కూడిన ఫొటోనూ ఆర్సిబి ‘ఎక్స్’లో షేర్ చేసింది. మేమంతా నూతన ‘కవచం’తో సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఐపిఎల్ భారీ అభిమానగణం ఉన్న జట్లలో ఆర్సీబీ ఒకటి. ఇప్పటి మూడుసార్లు ఫైనల్కు వెళ్లి రన్నరప్గా సరిపెట్టుకుంది. ఈసారైనా టైటిల్ కల నెరవేరాలని అభిమానులు కోరుకుంటున్నారు. మార్చి 22న చెన్నై, ఆర్సిబి మధ్య జరిగే మ్యాచ్తో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది.