హసరంగకు పగ్గాలు..

May 9,2024 22:04 #Sports

మాథ్యూస్‌కు దక్కిన చోటు
టి20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు ఇదే
కొలంబో: వెస్టిండీస్‌, అమెరికా వేదికలుగా జరిగే టి20 ప్రపంచకప్‌లో ఆడే శ్రీలంక జట్టును ఆ దేశ క్రికెట్‌బోర్డు గురువారం వెల్లడించింది. 15మంది ఆటగాళ్ల బృందానికి స్పిన్నర్‌ వనిందు హసరంగ కెప్టెన్‌గా ఎంపికవ్వగా.. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ మాధ్యూస్‌కు చోటు దక్కింది. అలాగే నలుగురు ఆటగాళ్లను రిజర్వు ప్లేయర్స్‌గా ఎంపిక చేసింది. శ్రీలంక జట్టు ఆటగాళ్లు ఈనెల 14న టి20 ప్రపంచకప్‌లో ఆడేందుకు బయల్దేరి వెళ్లనున్నారు. ఇక గ్రూప్‌-డిలో శ్రీలంక జట్టులో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్‌, నేపాల్‌ జట్లు ఉన్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు రెండోరౌండ్‌కు చేరనున్నాయి.
జట్టు: హసరంగ(కెప్టెన్‌), అసలంక(వైస్‌ కెప్టెన్‌), కుశాల్‌ మెండీస్‌, నిస్సంక, కమిందు మెండీస్‌, సమరవిక్రమ, మాథ్యూస్‌, శనక, ధనుంజయ, తీక్షణ, వెల్లలగె, ఛమీర, తుషార, పథీరన, మధుశంక.
రిజర్వు ప్లేయర్స్‌: ఫెర్నాండో, విజయకాంత్‌, రాజపక్సె, లియనాగే.

➡️