T20 cricket గుడ్‌బై.. కోహ్లీ, రోహిత్‌శర్మ సంచలన నిర్ణయాలు..

Jun 30,2024 06:43 #Cricket, #Sports, #T20 world cup

భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించిన భారత స్టార్‌ ఆటగాళ్లు రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ ఇద్దరూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇద్దరు టీ20లకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు అందుకున్న కోహ్లీ మాట్లాడుతూ.. ఇదే తన చివరి ప్రపంచకప్‌ అని, మేం ఏం కోరుకున్నామో అది సాధించామని పేర్కొన్నాడు. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకునేందుకు సుదీర్ఘకాలం వేచి చూసినట్టు చెప్పాడు. రోహిత్‌ 9 ప్రపంచకప్‌లు ఆడాడని, తాను ఆరు ఆడానని పేర్కొన్నాడు. తర్వాతి తరానికి చోటివ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. కోహ్లీ తన కెరియర్‌లో 125 అంతర్జాతీయ టీ20లు ఆడి 4,188 పరుగులు చేశాడు.

ఇదే సరైన సమయమం
పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నట్టు పేర్కొన్నాడు. ఇంతకుమించి సరైన సందర్భం ఉంటుందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నాడు. రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నందుకు మాటలు రావడం లేదన్నాడు. ట్రోఫీ గెలవాలనుకున్నానని, గెలిచానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 37 ఏళ్ల రోహిత్‌శర్మ 159 మ్యాచ్‌లు ఆడి 4,231 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

➡️