ఘోర ఓటమి.. కేఎల్‌ రాహుల్‌పై లక్నో జట్టు ఓనర్‌ ఆగ్రహం

May 9,2024 12:12 #Cricket, #Sports

ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌ సన్‌ రైజర్స్‌ జట్టు భారీ విజయం అందుకుంది. అయితే 162 పరుగుల లక్ష్యాన్ని సన్‌ రైజర్స్‌ ఓపెనర్లు శర్మ, హెడ్‌ కేవలం 9.4 ఓవర్లలోనే చేధించారు. ఈ మ్యాచ్‌ తర్వాత లక్నో సూపర్‌జెయింట్స్‌ యజమాని సంజీవ్‌ గోయెంకా కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ ప్రశాంతంగా అతడికి ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నా.. కూడా ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇక, కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ కూడా వచ్చిన సమయంలో ఎల్‌ఎస్జీ ఓనర్‌ కేఎల్‌ రాహుల్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తునే ఉన్నారు. ఆ టైంలో కెప్టెన్‌ రాహుల్‌ కాస్త అసౌకర్యంగా కనిపించడంతో అక్కడి నుంచి గోయెంకా వెళ్లిపోయాడు. దీంతో ఈ వీడియా కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక, సంజీవ్‌ గోయెంకాపై నెటిజన్స్‌ పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు. షేమ్‌ ఆన్‌ సంజీవ్‌ గోయెంకా, షేమ్‌ ఆన్‌ లక్నో యాజమాన్యం ట్యాగ్‌ లైన్‌ తో సోషల్‌ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.

➡️