మాడ్రిడ్: డబ్ల్యుటిఎ మాడ్రిడ్ మహిళల సింగిల్స్ టైటిల్ను టాప్సీడ్ ఇగా స్వైటెక్, పురుషుల సింగిల్స్ టైటిల్ను రష్యాకు చెందిన రుబ్లేవ్ చేజిక్కించుకున్నారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో స్వైటెక్ 7-5, 4-6, 7-6(7-3)తో అర్యానా సబలెంకాను చిత్తుచేసింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన సబలెంకను ఈ ఏడాది స్వైటెక్ చెక్ పెట్టింది. ఈ మ్యాచ్ సుమారు మూడుగంటల 11 నిమిషాలసేపు సాగింది. ఇక పురుషుల సింగిల్స్ ఫైనల్లో రుబ్లేవ్ 4-6, 7-5, 7-5తో ఫిలెక్స్ అగర్-అలిసెమిని చిత్తుచేశాడు. టోర్నీ ప్రారంభంలో పేలవ ప్రదర్శనతో మొదలుపెట్టిన రుబ్లేవ్ ఏకంగా టైటిల్ను చేజిక్కించుకోవడం విశేషం.