విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీడీవో వెంకటరమణ
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం వాయిదా
ప్రజాశక్తి – పగిడ్యాల
ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కార్యక్రమం వాయిదా వేసినట్లు ఎంపీడీవో వెంకటరమణ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడారు. ఈనెల 15వ తేదీన జరగాల్సిన ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందన్నారు. రాష్ట్రంలోని కోనసీమ జిల్లాలో తుఫా ను కారణంగా భారీ వర్షాలు పడి వరదలు సంభవించడంతో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు. ఈనెల 26వ తేదీన ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.