పార్వతీపురం : జగనన్నకు చెబుదాం (జెకేసి) కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వినతులు వెల్లువెత్తాయి. 140మంది తమ సమస్యలపై అధికారులకు వినతులు సమర్పించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరు నిశాంత్ కుమార్ నేతృత్వంలో జాయింట్ కలెక్టరు ఆర్.గోవిందరావు, ఐటిడిఎ పిఒ సి.విష్ణు చరణ్, డిఆర్ఒ జె.వెంకటరావు, కెఆర్సిఎస్డిసి జి.కేశవనాయుడు ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పెట్టుకునే అర్జీలకు వారు సంతృప్తి చెందేలా సరైన పరిష్కారం చూపాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అనంతరం సీతానగరం మండలం అప్పయ్యపేటకు చెందిన రెడ్డి విజరుకుమార్కు రూ.10వేలు విలువ చేసే ట్రైసైకిల్ను, కొమరాడకు చెందిన దత్తి పకీరునాయుడుకు రూ.10వేలు విలువ చేసే ట్రై సైకిళ్లను, జియమ్మవలస మండలం చినతుంబలికి చెందిన అమిటి పకీర్ నాయుడుకు ట్రై సైకిల్ను జాయింట్ కలెక్టరు ఆర్. గోవిందరావు అందజేశారు. ఈ సమావేశంలో అన్నిశాఖ జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.