ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న సవితమ్మ
పరిగి : టిడిపితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ అన్నారు. మండల కేంద్రంలోని బీరలింగేశ్వరస్వామి కళ్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన టిడిపి నాయకులు, కార్యకర్తల సమావేశంలో సవితమ్మ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పెనుగొండ నియోజకవర్గంలో తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ సూర్యనారాయణ, సర్పంచి బాలాజీ, మాజీ వైస్ ఎంపీపీ చౌడప్ప, డిఎస్ఎల్ శ్రీనివాసులు, గోవిందరెడ్డి, వడ్డెర శ్రీనివాసులు, నాగభూషణం పాల్గొన్నారు.
పెనుకొండ : రాష్ట్రంలో ఆరాచక పరిపాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని టీడీపీ, జనసేన ఉమ్మడి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ జోస్యం చెప్పారు. శుక్రవారం మండలంలోని నాగలూరు పంచాయతీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ నాగలూరు నారాయణ స్వామి ఆధ్వర్యంలో నాగులూరు ,బండ్లపల్లి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ లోకి అధికారం లోకి రాగానే అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలు గురించి ప్రజలకు సవితమ్మ వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం,జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ,మహిళలు ,పాల్గొన్నారు.