తప్పుల్లేకుండా ఓటర్ల జాబితా : పిఒ

Jan 19,2024 21:30

ప్రజాశక్తి – సీతంపేట  :  ఓటర్ల జాబితాలో ఒక్క తప్పు కూడా ఉండకూడదని ఐటిడిఎ పిఒ కల్పనాకుమారి అన్నారు. శుక్రవారం పాలకొండ నియోజక వర్గంలోని తహశీల్దార్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పిఒ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సరిచేస్తామన్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్లు నరసింహమూర్తి, కుమార్‌, సోమేశ్వరరావు, డీటీలు పాల్గొన్నారు.

➡️