బాధ్యతలు తీసుకుంటున్నరామచంద్రారెడ్డి
ప్రజాశక్తి – ఆదోని
ఆదోని మున్సిపల్ కమిషనర్గా రామచంద్రారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ బాధ్యతలు నిర్వర్తించిన మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి ప్రొద్దుటూరుకు బదిలీ అయ్యారు. బాపట్ల మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న రామచంద్రారెడ్డిని ఆదోని మున్సిపల్ కమిషనర్గా ప్రభుత్వం నియమించింది. కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి మాట్లాడారు. ఆదోని పురవాసులకు అందుబాటులో ఉంటామని, సమస్యలుంటే తనను సంప్రదించాలని కోరారు.
ఈనెల 31లోపు పన్ను చెల్లిస్తే వడ్డీ రాయితీ
మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి, ఖాళీ స్థలం పన్నులు ఈనెల 31లోపు చెల్లించి వడ్డీ మినహాయింపు పొందాలని నూతన కమిషనర్ రామచంద్రా రెడ్డి తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పురపాలక అభివృద్ధి కోసం పన్నులు సకాలంలో చెల్లించి భాగస్వాములు కావాలని తెలిపారు. రెవెన్యూ ఆఫీసర్ అస్లాం బాష, మేస్త్రి మహబూబ్ బాషా ఉన్నారు.