సచివాలయాలతో మెరుగైన సేవలు

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఫాల్గుణ

ప్రజాశక్తి- హుకుంపేట: మండలంలోనిములియపుట్టు, రంగశీల, భీమవరంలో నూతన సచివాలయాలను ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, జడ్పీటీసీ రేగం మత్స్యలింగం, వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు శనివారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, సచివాలయాలతో పరిపాలన సులభతరమైందని, ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు. సచివాలయం వ్యవస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు చేసి నిర్మాణాలు చేపడుతుందని ఆయన తెలిపారు. వైస్‌ ఎంపీపీ సూడిపల్లి కొండలరావు, సర్పంచ్‌ నైని సన్నీబాబు మాట్లాడుతూ, నూతన సచివాలయం ఏర్పాటుతో ప్రజలకు సేవలు అందుబాటులో వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో బాకూరు ఎంపీటీసీ నైని రజని, భీమవరం సర్పంచ్‌ నైని సన్నీ బాబు, డీఈ రామం, డిప్యూటీ తహశీల్దార్‌ కృష్ణా రావు, ఏఈ శెట్టి సంజీవరావు, తడిగిరి ఎంపీటీసీ పరదాని భీమలింగేశ్‌, సర్పంచ్‌లు పాడి అప్పల నాయుడు, కొప్పల లక్ష్మయ్య, పూజారి సుబ్బారావు, సీదరి సాంబ పాల్గొన్నారు.

➡️