హైదరాబాద్: మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే పొడిచి చంపిన సంఘటన సికింద్రాబాద్ తుకారాం గేటు పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ స్నేహితులు.. ఈ ఇద్దరు మటన్ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరు అప్పటికే మద్యం తాగేసి ఉండటంతో గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో అజయ్ కత్తితో చారిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.