తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు
అంగన్వాడీల డిమాండ్ల కోసం అమరన నిరాహార దీక్ష కైనా నేను సిద్ధం
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు
ప్రజాశక్తి – మాడుగుల: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలపై ప్రారంభించిన సమ్మెకు గవిరెడ్డి రామానాయుడు పూర్తి మద్దతు పలికారు. బుధవారం మాడుగుల నియోజకవర్గ కేంద్రం బస్టాండ్ ఆవరణలో చీడికాడ మాడుగుల ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెలో రామానాయుడు పాల్గొని ప్రసంగించారు. ప్రతి అంగన్వాడి మహిళకు ఒక సోదరుడిగా అండగా ఉండి తమ కోసం పోరాటం చేస్తానని రామానాయుడు తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చకపోతే తమకోసం అమరణ నిరాహార దీక్ష చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు . ఇదే విషయమై తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ తో మాట్లాడి కార్యాచరణ విషయమై ఆలోచన చేస్తామని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాడుగుల డివిజన్ సిఐటియు కార్యదర్శి రొంగలి దేవుడి నాయుడు, సిపిఎం మండల అధ్యక్షురాలు కార్లే భవాని, సిపిఎం మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ పుప్పాల రమేష్, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ మాడుగుల మండల అధ్యక్షురాలు బేతా భాగ్యలక్ష్మి, చీడికాడ మండలం అధ్యక్షురాలు మేడపు రెడ్డి జానకి, టిడిపి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ మెంబర్ మరువాడ ఈశ్వరరావు, మాడుగుల జనసేన నాయకుడు రొ బ్బ మహేష్,తెలుగుదేశం నాయకులుతదితరులు పాల్గొన్నారు.