విద్యార్థులకు బుక్స్ పంపిణీ

Dec 29,2023 00:32

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్
మండలంలోని కొప్పెరపాడు జెడ్‌పి ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్ధులకు బూచేపల్లి సుబ్బారెడ్డి, వెంకాయమ్మ చారిట్రబుల్ ట్రస్ట్ సహకారంతో వైసిపి రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగు మీడియం విద్యార్థులకు అల్ ఇన్ వన్ స్టడీ మెటీరియల్ అందజేశారు. పేద విద్యార్థులకు పేదలకు బూచేపల్లి ట్రస్ట్ ఎల్లప్పుడూ సహకరిస్తుందని అన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం పురంశెట్టి శ్రీనివాసరావు, జంపు హరిబాబు, సర్పంచ్ అనమనమూరు, స్కూల్ చైర్మన్ దమ్ము అంజయ్య, జ్యోతి రోశయ్య, పూర్వవిద్యార్ది షేక్ జాన్ బాషా పాల్గొన్నారు.

➡️