మోగిన సమ్మె – స్తంభించిన పాలన

Dec 20,2023 13:18 #Chittoor District
samagra siksha employees strike chittoor

అటెండర్ డ్యూటీలో అధికారులు

ప్రజాశక్తి – ఎస్ఆర్ పురం : చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజక వర్గం, ఎస్ఆర్ పురం మండలంలో విద్యాశాఖ కార్యాలయం లో విధులు నిర్వర్తిస్తున్న సమగ్ర శిక్ష సిబ్బంది సమ్మె చేయడానికి సిద్దంగా వున్నాము అని స్థానిక మండల విద్యాశాఖ అధికారులు అరుణాచలం రెడ్డి , సబర్మతి లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బముగా ప్రభుత్వము మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి,వెంటనే రేగులైజేషన్ చేయాలని కోరారు . అలాగే పెండ్డింగ్ లో వున్నా వేతనాలును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . సమగ్ర శిక్ష సిబ్బంది సమ్మె లో పాల్గొనడంతో అధికారులే అటెండర్ విధులను కూడా అధికారులే చూసుకోవలసిన దుస్థితి అని స్థానికులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు ఎంఐఎస్ కోఆర్డినేటర్ మరియు సిఆర్ఎంటిలు అలాగే పి టి ఐ.లు మెసెంజర్ పాల్గొనడం జరిగినది.

➡️