పాపువా న్యూగునియా : గ్రామంలోని కొండచరియలు విరిగిపడి సుమారు 100మందికిపైగా మృతి చెందిన ఘోర ఘటన శుక్రవారం పాపువా న్యూ గునియాలో జరిగింది. ఆస్ట్రేలియా బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ న్యూస్ నివేదిక ప్రకారం … పాపువా న్యూ గునియా రాజధాని పోర్ట్ మోరెస్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్ లోని మారుమూల కౌకలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద మృతదేహాలను తొలగించడానికి అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Report:
The massive landslide in Mulutaka, Enga province Papua New Guinea yesterday night. It covered many people and Will be identified after a month.
Reporter: Nehemiah Walyo pic.twitter.com/jAMLQtjleh
— Reporter Today News Channel (@reportertoday88) May 24, 2024