Landslides – కొండచరియలు విరిగిపడి 100 మందికిపైగా మృతి

May 24,2024 12:35 #100, #landslides, #more than, #people died

పాపువా న్యూగునియా : గ్రామంలోని కొండచరియలు విరిగిపడి సుమారు 100మందికిపైగా మృతి చెందిన ఘోర ఘటన శుక్రవారం పాపువా న్యూ గునియాలో జరిగింది. ఆస్ట్రేలియా బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ న్యూస్‌ నివేదిక ప్రకారం … పాపువా న్యూ గునియా రాజధాని పోర్ట్‌ మోరెస్బీకి వాయువ్యంగా 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంగా ప్రావిన్స్‌ లోని మారుమూల కౌకలం గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల (స్థానిక కాలమానం ప్రకారం) సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 100 మందికిపైగా మరణించినట్లు స్థానికులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బండరాళ్లు, శిథిలాలు, చెట్ల కింద మృతదేహాలను తొలగించడానికి అధికారులు, స్థానికులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

 

 

➡️